వైఎస్సార్సీపీ నాయకుడు, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని ప్రభుత్వ విప్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. చిర్ల జగ్గిరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రభుత్వ విప్ గా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. కాగా గురువారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చిర్ల జగ్గిరెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనను ప్రభుత్వ విప్ గా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఏపీ చిర్ల జగ్గిరెడ్డి పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ