ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9999 పాజిటివ్ కేసులు, 77 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 11, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,47,686 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 4779 కి పెరిగింది. మరో 11069 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 71,137 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు.
కరోనా వలన కడప జిల్లాలో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, నెల్లూరులో ఎనిమిది మంది, ప్రకాశంలో ఎనిమిది మంది, గుంటూరులో ఏడుగురు, కృష్ణాలో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూల్ లో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4779 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (సెప్టెంబర్ 11, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 44,52,128
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 5,47,686
- కొత్తగా నమోదైనా కేసులు : 9999
- నమోదైన మరణాలు : 77
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 4,46,716
- యాక్టీవ్ కేసులు : 96191
- మొత్తం మరణాల సంఖ్య : 4779
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu