ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు, కొత్తగా జైన్ మరియు సిక్కుల కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన) సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తూ మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిన రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్య వైశ్య కార్పొరేషన్లు ఈ ప్రత్యేక సంక్షేమ శాఖ పరిధిలోకి రానున్నట్టు తెలిపారు. అలాగే జైన్ ల, సిక్కుల సంక్షేమానికి కూడా వేర్వేరుగా కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ