దేశంలో మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 18ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ అందజేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 18-45 సంవత్సరాల వయసు వారందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో 18-45 సంవత్సరాల గలవారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారని, వారందరికీ ప్రభుత్వ ఖర్చుతోనే ఉచితంగా వ్యాక్సిన్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ రోజు రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రులు, అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ