భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా నవంబర్ 14, గురువారం నాడు ఇసుక కొరతపై ఒక రోజు దీక్ష చేపట్టాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీస్, మున్సిపల్ కమిషనర్లను తెదేపా నాయకుల బృందం కోరింది. దీనిపై సంబంధిత అధికారులు స్పందిస్తూ, ఆ స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ చంద్రబాబు దీక్ష కచ్చితంగా కొనసాగుతుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రాంతంలో గల ధర్నా చౌక్ ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుని పరిశీలిస్తున్నట్టు వారు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబరు 3న విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించి తన గళాన్ని గట్టిగా వినిపించగా, బీజేపీ పార్టీ నాయకులు విజయవాడలో ఇసుక సత్యాగ్రహాన్ని నిర్వహించారు.
[subscribe]