ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం కార్పోరేషన్స్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రెడ్డి, కమ్మ, క్షత్రియ కులాలకు కార్పొరేషన్లు చేస్తూ శుక్రవారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కులాల్లో ఆర్ధికంగా వెనకబడిన ప్రజలకు మద్దతుగా ఉండేలా, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేటాయించేలా ఈ కార్పోరేషన్స్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు ఇప్పటికే 56 బీసీ కార్పోరేషన్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేసి, ఆ కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ