ఏపీలో కర్ఫ్యూ జూన్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం

Andhra Pradesh Corona Lockdown, Andhra Pradesh Corona Lockdown Extended, Andhra Pradesh extends COVID-19 curfew, Andhra Pradesh extends curfew, Andhra Pradesh extends curfew till June 10, Andhra Pradesh govt extends COVID-19 curfew, Andhra Pradesh govt extends partial curfew, AP Govt Extended Curfew, AP Govt Extends Curfew in the State till June 10th, AP Lockdown News Live, COVID-19, curfew in andhra pradesh, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5వ తేదీనుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ఫ్యూ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కర్ఫ్యూను జూన్ 10 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. కరోనా నియంత్రణ చర్యలపై ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా కర్ఫ్యూ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు.

కర్ఫ్యూ అమలులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవడం సహా, ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. జూన్ 10 వరకు కూడా ఇదే సడలింపు సమయం అమల్లో ఉండనుంది. ఇక ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయనున్నారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలనే అనుమతించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 13 =