ఏపీలో కొన్ని కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన మరోసారి పొడిగింపు

Andhra government, AP Govt Extends Special Officers Rule, AP Govt Extends Special Officers Rule in Some Corporations, AP Govt Extends Special Officers Rule in Some Corporations and Municipalities, Greater Hyderabad Municipal Corporation Act, Mango News, Special Officer Rule in Some Corporations and Municipalities, Special Officers Rule, Special Officers Rule Extended

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శ్రీకాకుళం, నెల్లూరు, రాజమండ్రి కార్పోరేషన్స్ సహా 35 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు ప్రత్యేక ఆఫీసర్ల పదవీ కాలం ఈ ఏడాది మార్చిలో ముగియగా, మరికొందరి పదవీకాలం జూన్‌, జూలై, ఆగస్టులలో ముగిసింది. ఈ నేపధ్యంలో ప్రత్యేక అధికారుల పాలనను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అధికారుల పాలన 6 నెలలు లేదా ఆయా చోట్ల ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం ఏర్పడే వరకు కొనసాగనున్నట్టు తెలిపారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు 9 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో నూతన ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 1 =