ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శ్రీకాకుళం, నెల్లూరు, రాజమండ్రి కార్పోరేషన్స్ సహా 35 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు ప్రత్యేక ఆఫీసర్ల పదవీ కాలం ఈ ఏడాది మార్చిలో ముగియగా, మరికొందరి పదవీకాలం జూన్, జూలై, ఆగస్టులలో ముగిసింది. ఈ నేపధ్యంలో ప్రత్యేక అధికారుల పాలనను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అధికారుల పాలన 6 నెలలు లేదా ఆయా చోట్ల ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం ఏర్పడే వరకు కొనసాగనున్నట్టు తెలిపారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు 9 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో నూతన ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ