ఇటీవలే అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూను గురువారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రతినిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై పోరాడే ప్రజా నాయకుడు జ్యోతుల నెహ్రూ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించానని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో తెలుగుదేశం పార్టీకి, ప్రజలకు ఆయన అనేక సేవలు అందించాలని అన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ తో పాటుగా కాకినాడ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్, రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి టీడీపీ యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు, తదితరులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ