ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 18, గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉదయం 9 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. ముందుగా ఇటీవల మరణించిన పలువురు మాజీ ప్రజాపతినిధులకు సంబంధించిన సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టి శాసనసభ ఆమోదించింది. అనంతరం బద్వేలు ఉపఎన్నికలో గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై అత్యవసరంగా చర్చించాలని టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ వాయిదా వేశారు.
ఆ తర్వాత స్పీకర్ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. బీఏసీ సమావేశంలో నవంబర్ 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో మొత్తం 14 బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ