ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 10, శుక్రవారం రాత్రి 7 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మొత్తం 133 ప్రాంతాలను కరోనా రెడ్ జోన్లుగా ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 30 రెడ్ జోన్లు గుర్తించగా, కర్నూల్ లో 22, కృష్ణా జిల్లాలో 16, గుంటూరులో 12, ప్రకాశంలో 11 ప్రాంతాలను రెడ్ జోన్లు గా గుర్తించారు.
ఈ రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాలను పోలీసుల పర్యవేక్షణలో ఉంచి కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాకుండా, అలాగే ఈ ప్రాంతాల్లోకి బయటి నుంచి ఎవరూ రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి చెకింగ్ చేస్తున్నారు. అత్యవసర కారణాలు ఉంటే తప్ప ఎవరిని బయటికి వెళ్లనీయడం లేదు. ఈ ప్రాంతాల్లో ప్రతి ఇంటిలో వాలంటీర్లు, ఆశావర్కర్లు సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే పారిశుద్ధ్య సిబ్బంది కూడా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu