దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,32,788 కరోనా కేసులు నమోదవడంతో జూన్ 2, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,83,07,832 చేరుకుంది. 6 రోజుల నుంచి రోజువారీ కరోనా కేసులు 2 లక్షల కన్నా తక్కువగా నమోదవుతుండగా, వరుసగా 20వ రోజూ కూడా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కుగా నమోదయ్యాయి. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 3,207 మంది మరణించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
దేశంలో 17 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 92.48 శాతం:
ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, అస్సాం, తెలంగాణ, పంజాబ్ వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం 17,93,645 (6.34%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 2,31,456 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 2,61,79,085 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 92.48 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. ఇక జూన్ 1, మంగళవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 35 కోట్లు (35,00,57,330) కు చేరుకుంది. గత 24 గంటల్లో 20,19,773 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ