ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గత రెండు నెలలకు పైగా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసి భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తిరుమలలో శ్రీవారి దర్శనాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీటీడీ ఈవో ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో జూన్ 2 మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, దర్శనాలకు అనుమతినిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్వర్వులు జారీచేశారు. ముందుగా కరోనా నిబంధనలను అనుసరిస్తూ ట్రయల్ రన్ గా టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్టు టీటీడీ పేర్కొంది. దర్శనానికి భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu