సీతమ్మసాగర్ బ్యారేజ్ నిర్మాణం కోసం 27.9 హెక్టార్ల(68.9 ఎకరాలు) అటవీ భూమిని తెలంగాణ నీటిపారుదలశాఖకు బదిలీ చేస్తూ కేంద్రం ప్రభుత్వం జూన్ 2, మంగళవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ఈ బ్యారేజి నిర్మాణానికి అవసరమైన తుది పర్యావరణ అనుమతులను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
దేవాదుల ప్రాజెక్టుకు నిరంతరం నీటిసరఫరా కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై సీతమ్మసాగర్ పేరుతో బ్యారేజీ నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం ములుగు మండలం ఏటూరు నాగారం, వెంకటాపురం అటవీ డివిజన్ల పరిధిలో అటవీ భూమి సేకరణ అవసరం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర అటవీ శాఖ ఆ భూమిని తెలంగాణ నీటిపారుదలశాఖకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu