ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో కొత్త పింఛన్లు మంజూరు చేసింది. అక్టోబర్ నెలలో కొత్తగా 1270 ఆరోగ్య పింఛన్లు, 63610 ఇతర పింఛన్లు కలిపి మొత్తం 64880 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. కొత్తగా మంజూరైన వారితో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం 61,94,243 మంది లబ్ధిదారులకు నవంబర్ 1, ఆదివారం నాడు పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం ఇప్పటికే రూ.1,499.89 కోట్లను గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ఖాతాల్లో జమచేసింది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి పింఛన్ నగదును అందజేయనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu