ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యం విషయంలో ప్రజలకు మరింత సేవలు అందించే దిశగా మరో కార్యక్రమం పెద్దఎత్తున ప్రారంభం కానుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 1, శుక్రవారం) వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించనున్నారు. గర్భిణులకు మరియు బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ఈ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో శుక్రవారం ఉదయం 500 వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న వాహనాలకు అదనంగా ఈ 500 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాహనాలు చేరుకోనున్నాయి. ఈ వాహనాలలో గర్భిణులను ఉచితంగా ఆసుపత్రికి చేర్చడం మరియు డెలివరీ అనంతరం బాలింతలను తిరిగి ఉచితంగా ఇంటికి చేర్చడం వంటి సేవలను అందించనున్నారు. విజయవాడలో వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభోత్సవానికి సంబంధిత అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ