రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్పై సెస్ విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, హైస్పీడ్ డీజిల్పై లీటర్ కు రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఈ రోజు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోలు, డీజిల్పై వ్యాట్ తో పాటుగా సెస్ను కూడా వసూలు చేయనున్నారు. ఈ మొత్తాన్ని డీలర్ నుంచి వసూలు చేయాలని పేర్కొన్నారు. సెస్ వసూలు ద్వారా రూ.600 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం సెస్ విధింపు ద్వారా సమకూరే ఆదాయాన్ని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu