ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు (ఫిబ్రవరి 8, బుధవారం) ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్ సాగర్కు నివాళి అర్పిస్తూ ఏపీ రాష్ట్ర కేబినెట్ మౌనం పాటించింది. ఇక కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు:
- 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం
- కర్నూలులో జాతీయ న్యాయ విద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం
- ఫిబ్రవరి 28న జగనన్న విద్యాదీవెన చెల్లింపులు
- వైఎస్ఆర్ లా నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకాలను ఆమోదం
- భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ప్రతిపాదనలపై చర్చ, ఆమోదం
- సుమారు రూ.లక్షా 45 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం
- ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద 2 విడతల్లో రూ.1.10 లక్షల కోట్లతో న్యూఎనర్జీ పార్క్ ఏర్పాటు.
- 1000 మెగావాట్ల చొప్పున విండ్, సోలార్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
- వైజాగ్ టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయింపు, వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు
- పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు ఆమోదం
- నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోదం
- తాడేపల్లిగూడెంలో పోలీస్ సబ్ డివిజన్, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
- ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్టు ఏర్పాటు
- లీగల సెల్ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
- డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- డోన్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం
- రైతులకు ఇన్ఫుట్ సబ్సీడీ చెల్లింపుకు ఆమోదం
- రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటివ్ బెర్త్ల నిర్మాణానికి ఆమోదం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE