భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. గత 24 గంటల్లో 96424 పాజిటివ్ కేసులు నమోదవగా, 1174 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 18, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 52,14,677 కు, మరణాల సంఖ్య 84,372 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు రికార్డుస్థాయిలో 87,472 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఒకేరోజు వ్యవధిలో ఇంతపెద్దసంఖ్యలో కరోనా బాధితులు కోలుకోవడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 41,12,551 కు చేరుకుంది.
దేశంలో ప్రసుతం కరోనా రికవరీ రేటు 78.9 శాతం గానూ, మరణాల రేటు 1.62 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతుండగా, మరణాలు ఎక్కువుగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,17,754 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. యాక్టీవ్ కేసుల్లో దాదాపు 60 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu