ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలుచోట్ల మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2,050 కోట్లతో, అలాగే ఆరు చోట్ల కాలేజీల నిర్మాణం కోసం స్థలాల కొనుగోలుకై 104.17 కోట్ల రూపాయలతో పాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లి, ఆదోని, పులివెందులలో కాలేజీల కోసం స్థలాలు కొనుగోలు చేయనున్నారు.
మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల కేటాయింపు:
- విశాఖ జిల్లా పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.500 కోట్లు
- కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.550 కోట్లు
- వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.500 కోట్లు
- గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ.500 కోట్లు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu