అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పలు హామీలను ఇప్పటికే అమలులోకి తెచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా మరో హామీని నెరవేర్చారు. ‘వెలుగు’ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ)ల గౌరవవేతనాన్ని రూ.10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,297 మంది వెలుగు వీఓఏలు ప్రయోజనం పొందనున్నారు. పెంచిన రూ.10 వేల వేతనంలో ప్రభుత్వం నుంచి రూ.8 వేలు, గ్రామ సంఘాల నుంచి రూ.2 వేలు చెల్లించనున్నారు. వారితో పాటు మెప్మా, యానిమేటర్లు, సంఘమిత్రాలకు కూడ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన వేతనాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
[subscribe]
CM YS Jagan Announces Big Good News For Muslim Brothers Over Madarsa Board | AP News | Mango News
07:27
AP CM YS Jagan Straight Question To Pawan Kalyan | #AbulKalamAzadBirthAnniversaryCelebrations
09:57
CM YS Jagan Speech About Maulana Abul Kalam Azad In His Birth Anniversary Celebrations | AP Politics
08:06
CM YS Jagan Announces Good News About Shadi Ka Thofa Scheme For Muslims Says Deputy CM Amzath Basha
06:20