ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల బుకింగ్ విషయంలో ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్/ వెబ్సెట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. రైల్వే ఆన్లైన్ టికెటింగ్ సిస్టం తరహాలో రాష్ట్రంలోని సింగిల్ థియేటర్స్ మరియు మల్టీఫ్లెక్స్ లలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం పోర్టల్ ను రూపొందించబోతున్నట్టు తెలిపారు. ఈ సినిమా ఆన్లైన్ టికెటింగ్ సిస్టంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్, అభివృద్ధి, అమలు పక్రియ కోసం ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నెం.782ను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది.
కమిటీలో సభ్యులు:
- హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ – చైర్మన్
- ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ – కోచైర్మన్
- ఐ అండ్ పీఆర్, ఏపీఎఫ్టీడీసీ సెక్రటరీ – మెంబర్
- కమర్షియల్ టాక్స్ రిప్రెజెంటేటివ్ ఆఫ్ కమిషనర్ – మెంబర్
- ఏపీటీఎస్ ఎండీ – మెంబర్
- కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) – మెంబర్
- గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) – మెంబర్
- ఐటీ శాఖ స్పెషల్ సెక్రటరీ – మెంబర్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ