తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం తిరుమల ఆలయాన్ని సందర్శించారు. రేపటినుంచి ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో యాత్ర విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తూ స్వామివారి ఆశీస్సులు కోసం తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం తీసుకుని స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఇక లోకేష్ రాక సందర్భంగా పలువురు జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తిరుమలకు చేరుకున్నారు. కాగా నారా లోకేష్ నేడు కుప్పంలో పాదయాత్ర కమిటీలతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో యువగళం ఏర్పాట్లను పరిశీలించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రేపు ఉదయం 11:03 గంటలకు నారా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కాగా లోకేష్ పాదయాత్రకు చిత్తూరు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇవివాదం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE