ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులుగా 13 జిల్లాలకు ఐఏఎస్ల అధికారులను నియమించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు చేసే వ్యయంపై ఈ పరిశీలకులు నిఘా పెట్టనున్నారు. ఈ మేరకు ఎస్ఈసీ రమేశ్కుమార్ మార్చ్ 10, మంగళవారం నాడు ఆదేశాల జారీ చేశారు. ఈ 13 మందితో సహా మరో నలుగురు పరిశీలకులను నియమించి వారిని రిజర్వులో ఉంచినట్టుగా పేర్కొన్నారు.
జిల్లాల వారీగా నియామితులైన స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు:
- కృష్ణా – పి.రామకృష్ణ
- గుంటూరు – బీఎన్ఎన్ మూర్తి
- ప్రకాశం – జి.శేఖర్బాబు
- తూర్పుగోదావరి – సి.సెల్వం
- పశ్చిమగోదావరి – అనంత్శంకర్
- నెల్లూరు – సునీల్కుమార్
- కర్నూలు – ఎం.శివప్రసాద్
- చిత్తూరు – జగన్నాథ్సింగ్
- అనంతపురం – జీజీ నరేంద్రన్
- కడప – అలాన్ చోంగ్ టెరోన్
- శ్రీకాకుళం – ఆర్.యశోదాబాయి
- విశాఖపట్నం – నందిని సలేరియా
- విజయనగరం – జి. సందీప్ కృపాకర్
[subscribe]