ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు సలహాదారుల పదవీకాలం ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు సోమవారం జీవో విడుదల చేసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన సజ్జల, ప్రభుత్వంతో పాటు అధికార వైసీపీ పార్టీలో కూడా కీలక నేతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఆయనకు పార్టీలో కూడా సముచిత స్థానం కల్పించారు సీఎం జగన్. ఆయనతో పాటు మరో ముగ్గురి పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారుగా పనిచేస్తున్న జీవీడీ కృష్ణ మోహన్, మరో ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ సలహాదారు శామ్యూల్ ఉన్నారు. ఇక వీరితో పాటుగా ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్ అజయ్ కల్లం కూడా ఉన్నారు. వీరందరికి మరో ఏడాది కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ