ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి, తాజాగా ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మరో నలుగురు సీనియర్ స్థాయి ఐపీఎస్ అధికారులను కూడ ప్రభుత్వం బదిలీ చేసింది. నర్సీపట్నం ఏఎస్పీగా వై. రిషాంత్ రెడ్డి, రంపచోడవరం ఓఎస్డీగా ఆరిఫ్ హఫీజ్, రంపచోడవరం ఏఎస్పీగా వకుల్ జిందాల్ నియమితులయ్యారు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్ గా రాహుల్ దేవ్ సింగ్, విశాఖపట్నం అడిషనల్ ఎస్పీగా అజితా వేజెండ్ల, బొబ్బిలి ఏఎస్పీ గ్రేడ్-1 గౌతమి శాలిని, పార్వతీపురం ఏఎస్పీ గ్రేడ్-1గా గరుడ్ సుమిత్ సునీల్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
[subscribe]
[youtube_video videoid=yKJVJHvRrnI]