కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూడో విడత లాక్డౌన్లో భాగంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. ఇకపై ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. మద్యం షాపుల వద్ద తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. షాపు వద్ద ఒకేసారి ఐదుగురికి మాత్రమే అనుమతిస్తూ, ఒక్కొక్కరి మధ్య కనీసం ఆరు మీటర్ల దూరం ఉండేలా సర్కిల్స్ గీయాలని చెప్పారు. ఒకవేళ జనం వలన రద్దీ పెరిగితే కొద్దిసేపు షాపుల మూసివేయాలని సూచించారు.
మరో వైపు ఏపీలో మద్యం ధరలను 25% పెంచారు. పెరిగిన మద్యం ధరలు కూడా నేటినుంచి అమల్లోకి వస్తాయని, రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గించేందుకే ధరలు పెంచినట్టు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ వెల్లడించారు.
పెరిగిన మద్యం ధరల వివరాలు:
–>180 ఎంఎల్ మద్యం ధర రూ.120 వరకు ఉంటే:
- 60/90 ఎంఎల్ పై : రూ.10 పెంపు
- 180 ఎంఎల్ పై: రూ.20 పెంపు
- 375 ఎంఎల్ పై: రూ.40 పెంపు
- 750 ఎంఎల్ పై: రూ.80 పెంపు
- 1000 ఎంఎల్ పై: రూ.120 పెంపు
- 2000 ఎంఎల్ పై: రూ.240 పెంపు
–>180 ఎంఎల్ మద్యం ధర రూ.120 కంటే ఎక్కువ ఉంటే:
- 60/90 ఎంఎల్ పై : రూ.20 పెంపు
- 180 ఎంఎల్ పై: రూ.40 పెంపు
- 375 ఎంఎల్ పై: రూ.80 పెంపు
- 750 ఎంఎల్ పై: రూ.160 పెంపు
- 1000 ఎంఎల్ పై: రూ.240 పెంపు
- 2000 ఎంఎల్ పై: రూ.480 పెంపు
–>180 ఎంఎల్ మద్యం ధర రూ.150 కంటే ఎక్కువ ఉంటే:
- 60/90 ఎంఎల్ పై : రూ.30 పెంపు
- 180 ఎంఎల్ పై: రూ.60 పెంపు
- 375 ఎంఎల్ పై: రూ.120 పెంపు
- 750 ఎంఎల్ పై: రూ.240 పెంపు
- 1000 ఎంఎల్ పై: రూ.360 పెంపు
- 2000 ఎంఎల్ పై: రూ.720 పెంపు
–>బీర్లు:
- 330 ఎంఎల్కు రూ.20 పెంపు
- 500/650 ఎంఎల్ రూ.30 పెంపు
- 3 లీటర్ల బాటిల్ పై రూ.2000 పెంపు
- 5 లీటర్ల బాటిల్ పై రూ.3000 పెంపు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu