ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 10,505 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 10,032 మందికి కరోనా నెగిటివ్ గా నిర్ధారణ కాగా, 473 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలో కరోనా నియంత్రణపై వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఏప్రిల్ 14, మంగళవారం నాడు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జిల్లాల వారీగా నమోదైన కేసులతో పాటుగా క్వారంటైన్ కేంద్రాల వివరాలు, ఐసోలేషన్ వార్డులు, జిల్లాల్లో అందుబాటులో ఉన్న బెడ్లు వివరాలను ప్రభుత్వం బులెటిన్ లో వివరించింది. రాష్ట్రంలో రెండు పేజ్ లలో నిర్వహించిన ఫీవర్ సర్వే వివరాలు మరియు జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల వివరాలను ప్రభుత్వం ఈ హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.
పూర్తి వివరాల మీడియా బులెటిన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]