ఏపీ గవర్నర్ అబ్దుల్ న‌జీర్‌ ను క‌లిసిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

YSRCP MP Vijayasai Reddy Meets AP Governor Abdul Nazeer at Raj Bhavan,YSRCP MP Vijayasai Reddy,AP Governor Abdul Nazeer,Vijayasai Reddy Meets AP Governor,Mango News,Mango News Telugu,AP Governor,YSRCP MP,Abdul Nazeer,Vijayasai Reddy,YSRCP MP Vijayasai Reddy Latest News,AP Governor News,AP Governor Abdul Nazeer News and Updates,Abdul Nazeer Met MP Vijayasai Reddy,AP CM YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ న‌జీర్‌ ను వైఎస్సార్సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి రాజ్ భ‌వ‌న్‌కు వెళ్లి, బాధ్యతల స్వీకరణ సందర్భంగా గ‌వ‌ర్న‌ర్‌ కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్ష‌లు తెలిపారు. అలాగే ఈ సందర్భంగా గవర్నర్ ను శాలువాతో సత్కరించారు. కాగా ఏపీ నూతన గవర్నర్‌ గా జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

రాజ్‌భవన్‌ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ గా జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చేత హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, గవర్నర్ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, సంయుక్త కార్యదర్శి పిఎస్ సూర్య ప్రకాష్, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం రాజ్ భవన్ లో హై టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త గవర్నర్‌తో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు గ్రూప్ ఫొటో దిగారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 15 =