ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 502 పోస్టుల డీఎస్సీ లిమిటెడ్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ, మ్యూజిక్ టీచర్లు, ఆర్ట్ టీచర్లు, ఏపీ మోడల్ స్కూల్స్, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీల నియామకానికి గాను ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో వివరించింది. వీటిలో జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు, అలాగే మోడల్ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇక మున్సిపల్ స్కూళ్లలో 15 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వగా, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ విభాగంలో 81 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇక డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ కల్పించగా, నేటి నుంచి సెప్టెంబర్ 17 వరకు ఫీజు చెల్లింపు గడువుగా అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ చేపడతామని, అక్టోబర్ 23న పరీక్ష నిర్వహించి నవంబర్ 4వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY