ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఫిబ్రవరి 18, మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఏపీ రాజ్భవన్ లో గవర్నర్ను కలుసుకుని పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీలను నియమించే అంశంపై కీలకంగా చర్చించారు. ఈ బిల్లులపైనా సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేయాలన్న తన ఆదేశాలను మండలి కార్యదర్శి రెండుసార్లు తిరస్కరించడంపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ను కోరారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అనంతరం మండలి ఛైర్మన్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల ఏపీ శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ నియామక ఆదేశాలకు దారితీసిన పరిస్థితులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అలాగే సెలెక్ట్ కమిటీలను నియమించే అంశంలో తన ఆదేశాలను అమలు చేయకుండా మండలి కార్యదర్శి జాప్యం చేయడంపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తనకున్న విశేష అధికారంతోనే బిల్లులను సెలెక్ట్ కమిటీలకు పంపాలని నిర్ణయం తీసుకున్నాననీ, ఇంతవరకు ఛైర్మన్ నిర్ణయాన్ని మండలి కార్యదర్శి వ్యతిరేకించడం అనేది జరగలేదని షరీఫ్ పేర్కొన్నారు. ఈ అంశాలపై పూర్తీ వివరాలతో కూడిన నాలుగు పేజీల వినతి పత్రాన్ని మండలి ఛైర్మన్ షరీఫ్ గవర్నర్కు అందజేసినట్టు తెలుస్తుంది.
[subscribe]