ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహారించుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రాజధాని కేసుల కోసం ఏర్పాటు చేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తెలియజేశారు. ఈ రోజు జరిగిన ఏపీ కేబినేట్ భేటిలో రాజధాని వికేంద్రీకరణ(మూడు రాజధానుల బిల్లు), సీఆర్డీఏ రద్దు చట్టాల రద్దుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో ప్రకటించనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ