ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో, తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్ ను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రారంభించారు. బుధవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో నెలల చిన్నారికి వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పీసీవీ వ్యాక్సిన్ వేశారు. పిల్లలలో న్యుమోనియా మరణాల నివారణకు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇప్పటి వరకు పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్ లను ప్రభుత్వం అందిస్తుండగా, కొత్తగా ఇస్తున్న న్యుమోకోకల్ వ్యాక్సిన్ తో కలిపి మొత్తంగా 10 రకాల వ్యాక్సిన్ లు పిల్లలకు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ