ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) బ్రేక్ పడింది. ఈ ఎన్నికలను నిలిపివేస్తూ తాజాగా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ముందుగా రాష్ట్రంలో ఏప్రిల్ 8న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేలా ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా గత సంవత్సరంలో మార్చి 14న నిలిచిన ఈ ఎన్నికల ప్రక్రియను మళ్ళీ అక్కడినుంచే కొనసాగించే విధంగా ఎస్ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశాయి.
ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు కూడా విన్న అనంతరం ఎన్నికల పక్రియను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ విషయంలో ఏప్రిల్ 15 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘంను (ఎస్ఈసీ) కోర్టు ఆదేశించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ