తెలంగాణ రాష్ట్రంలో మే 26, మంగళవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1991 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 38 మందికి, వలస వచ్చిన వారిలో 12 మందికి, రంగారెడ్డి జిల్లాలో 7 గురికి, మేడ్చల్ లో 6, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో నలుగురికి, సూర్యాపేట, వికారాబాద్, నల్గొండ, నారాయణ పేట్ లలో ఒక్కో కేసుతో మొత్తం 71 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 57 కి చేరింది. అలాగే కొత్తగా 120 మందితో కలిపి ఈ వైరస్ నుంచి కోలుకుని 1284 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 650 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
Media bulletin
Date: May 26, 2020Status of positive cases of #COVID19 in Telangana. pic.twitter.com/4SEQXjzlYT
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 26, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu