జడ్జిలు, కోర్టులపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మే 26 న 49 మందికి నోటీసుల జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ అంశంపై మే 29, శుక్రవారం నాడు హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. విచారణ అనంతరం వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి మరో 44 మందికి కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కొత్తగా ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు, వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, డాక్టర్ పంచ్ ప్రభాకర్ సహా 44 మందికి నోటీసులు జారీ చేయాలనీ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను మూడువారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైకోర్టు ముందుగా నోటీసులు జారీచేసిన వారిలో పలువురిని పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu