ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే, ఏపీ ప్రజలు మాత్రం వైసీపీని ఓడించటానికి సిద్ధంగా ఉన్నారని, తాము కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తే సీఎం జగన్ పరిపాలనపై ప్రజల స్పందన కూడా బహిర్గతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉందని.. మరిన్ని రోజులు గడిస్తే ఆ వ్యతిరేకత ఇంకా పెరుగుతుందని బాబు వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఆర్ధికంగా కోలుకోలేని విధంగా తయారుచేస్తున్నారని చంద్రబాబు అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ