ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించే ఐసెట్-2020 ప్రవేశపరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఏపీ ఐసెట్–2020 పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ పరీక్షకు మొత్తం 51,991 మంది హాజరు కాగా, 40890 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్టు పేర్కొన్నారు. ఫలితాల విడుదల సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, రికార్డ్ సమయంలో ఫలితాలు విడుదల చేశామని చెప్పారు. టాప్-10 ర్యాంకులు సాధించినవారిలో నలుగురు అమ్మాయిలు చోటు దక్కించుకోవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఐసెట్ ఫలితాలను https://sche.ap.gov.in/ICET వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu