ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 సంవత్సరానికి గానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2022 (ఏపీ ఐసెట్-2022) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది ఈ పరీక్షను ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఏపీ ఐసెట్-2022 ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ లో మే 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఆలస్య రుసుము లేకుండా జూన్ 10 వరకు స్వీకరించనున్నారు. ఇక ఐసెట్ ప్రవేశ పరీక్షను జూలై 25వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆలస్య రుసుముతో దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ వివరాలు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ