మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో తొలినుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఈనెల 10న కేసు విచారణ నిమిత్తం ఆయన రావాలని సీబీఐ అధికారులు ఇప్పటికే నోటీసులిచ్చిన నేపథ్యంలో.. శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయం ఎదుట హాజరయ్యారు. కాగా ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు.. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న ఆయన సీబీఐ ముందు హాజరైన విషయం తెలిసిందే. ఇక విచారణలో భాగంగా తనను అరెస్ట్ చేయరాదంటూ ఎంపీ అవినాష్ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో ఆడియో, వీడియోగ్రఫీ రికార్డ్ చేయడానికి అవకాశం ఇవ్వాలని, ఇంకా తన న్యాయవాది వెంట ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్లో కోరారు.
ఇక తన పిటిషన్పై విచారణ ముగిసే వరకు సీఆర్పీసీ సెక్షన్ 161 కింద సీబీఐ తనను విచారించకుండా స్టే విధించాలని, అరెస్టు చేయడం సహా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని కూడా ఎంపీ అవినాష్ రెడ్డి అందులో విన్నవించారు. అలాగే ఈ పిటిషన్లో సీబీఐపై అనేక ఆరోపణలు చేసిన ఆయన, వైఎస్ వివేకా కుటుంబంలో కూడా కొన్ని వివాదాలున్నాయని, సొంత కుటుంబం నుంచే ఆయన ప్రాణాలకు ముప్పు ఉండొచ్చని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత నేడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎంపీ అవినాష్ రెడ్డి తన పిటిషన్లో వ్యక్తిగత మరియు కుటుంబ పరమైన అంశాలు పేర్కొనడంపై తన వాదన వినాలని, అందుకోసం అవినాష్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్లో తనను ఇంప్లీడ్ చేయాలని వైఎస్ సునీత కోరుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE