ఆంధప్రదేశ్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఏకకాలంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబు విడుదల చేశారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. మొత్తం 1022 సెంటర్లలో ఆగస్టు 3 నుంచి 12 వరకు ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు దాదాపు 430 మాల్ప్రాక్టిస్ కేసులను కూడా నమోదు చేశారు. ఇక ఉత్తీర్ణత విషయానికొస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జనరల్ విభాగంలో 35 శాతం, ఒకేషన్ల్లో 42 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్లో జనరల్ విభాగంలో 33 శాతం, ఒకేషన్ల్లో 46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక మొత్తం అన్ని విభాగాలను పరగణలోకి తీసుకుంటే ఈ ఏడాది ఇంటర్లో మొత్తం 70.63 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని బోర్డు అధికారులు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY