ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయిడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. జులై 4వ తేదీన భీమవరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నుంచి ప్రతినిధిని పంపాలని లేఖలో కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల జీవితాలను స్మరించుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి లేఖలో తెలిపారు.
ఈ నేపథ్యంలోనే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే ఆహ్వాన లేఖతో పాటు కిషన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి మరీ ఈ కార్యక్రమానికి పార్టీ నుంచి ప్రతినిధిని పంపాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు కిషన్ రెడ్డి సూచనకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు ఆదేశం మేరకు టీడీపీ తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొననున్నారని సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ