ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 12 కార్పొరేషన్లకు మరియు 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు మార్చి 10 పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ రేపు (మార్చి 14, ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఏలూరులో కార్పొరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీలో ఫలితాలు వెల్లడించవద్దని హైకోర్టు ఆదేశాలు ఉండడంతో మిగిలిన 11 కార్పొరేషన్లు మరియు 70 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతించడం లేదని, అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత నిమిత్తం మొత్తం 20,419 పోలీసు సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా కార్పొరేషన్లలో 2,204 టేబుళ్లు, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలో 1,822 టేబుళ్లు కలిపి మొత్తం 4,026 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాలెట్ పేపర్లు కావడంతో ఫలితాల సరళి ఏ పార్టీకి అనుకూలంగా ఉందో మధ్యాహ్నం సమయానికి స్పష్టత రానుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి ఫలితాలు రేపు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ