వైఎస్ఆర్సీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధం అని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం నగరిలో కొండచుట్టు ఉత్సవంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ముగ్గుల పోటీలకు హాజరైన సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఎవరు ఏం చేశారనేది అందరికీ తెలుసనీ, సీఎం జగన్ మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని తెలిపారు. ఇక 2024లో జరుగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కి 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన అలాగే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు రెడీ అని పేర్కొన్నారు.
ఈ క్రమంలో పార్టీ మరియు సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎక్కడైనా, ఎవ్వరిపైన అయినా పోటీ చేస్తానని, ఒకవేళ జనసేనాని పవన్ కళ్యాణ్పై పోటీ చేయమన్నా అందుకు తాను సిద్ధమని నటుడు అలీ స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని అన్నింటికీ అలవాటు పడాలని అన్నారు. ఇక వ్యక్తిగతం, వృత్తిపరంగా పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడని, అయితే సినిమాలు, రాజకీయాలు వేరు, వేరని అలీ అభిప్రాయపడ్డారు. కాగా గతేడాది నవంబర్ 8న సీఎం జగన్ ఆదేశాల మేరకు అలీ ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులైన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE