శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలవడం ద్వారా ఈ ఘనత అందుకుంది. కాగా దేశవ్యాప్తంగా 780 జిల్లాల్లో సుమారు 4 నెలల పాటు ఈ కార్యక్రమాల అమలు తీరును సమగ్రంగా పరిశీలించిన మీదట కేంద్ర ప్రభుత్వం చివరిగా కొన్ని జిల్లాలను ఎంపిక చేసింది. ఈ క్రమంలో కార్యక్రమాల అమలులో ఉత్తమ పనితీరు కనబర్చిన టాప్ 10 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో నిలిచిన నెల్లూరు జిల్లాకు కేంద్రం ఈ అవార్డును బహుకరించనుంది. ఈ మేరకు త్వరలో ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ఈ అవార్డు అందుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ