ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది నుంచి కొత్తగా మరో ఐదు మెడికల్ కాలేజీలలో అకడమిక్ కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతులు లభించాయి. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం మంగళవారం కీలక అనుమతులిచ్చింది. దీంతో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల లోని కొత్త వైద్య కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమవనున్నాయి. దీనికోసం ఆయా కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను ఇప్పటికే నియమించారు. అలాగే ఒక్కో కళాశాలకు 150 ఎంబీబీఎస్ సీట్లను ఎలాట్ చేయనున్నారు.
తాజా నిర్ణయం కారణంగా రాష్టంలో మరో 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఇక ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఎఫిలియేషన్ ఇవ్వడంతో గురువారం నుంచి ఆయా కళాశాలలు ఎన్ఎంసీకి దరఖాస్తు చేయబోతున్నట్లు డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. ఈ క్రమంలో ఆయా జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా సమగ్ర మార్పులు చేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్తగా 16 వైద్య కళాశాలలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ