తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 16వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించగా, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను జనవరి/ఫిబ్రవరి 2023 లో నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 కోసం ఆన్లైన్ కోచింగ్ తరగతులు ఆగస్టు 5, 2022 నుండి టీఎస్ బీసీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ సర్కిల్స్ డైరెక్టర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ఉచిత ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ (1000) అభ్యర్థులకు అంటే డిగ్రీ, ఇంటర్మీడియట్ లేదా తత్సమానంలో, ఎస్ఎస్సీ ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్టు తెలిపారు. అధిక విద్యార్హతలకు 10% మార్కులు, డిగ్రీ మార్కులకు 50%, ఇంటర్మీడియట్ మార్కులకు 20%, ఎస్ఎస్సీ మార్కులకి 20% వెయిటేజ్ మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి 5 లక్షల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులే అర్హులని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు “tsbcstudycircle.cgg.gov.in” వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో జూలై 22 నుండి జూలై 29, 2022 వరకు దరఖాస్తులను సమర్పించాలని చెప్పారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు 040-27077929 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY