ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 220 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 43, కృష్ణాలో 40, గుంటూరులో 36, తూర్పుగోదావరిలో 27, విశాఖపట్నంలో 20 నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 24, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,17,184 కు, మరణాల సంఖ్య 14720 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 472 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 22,97,537 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,927 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(220):
- పశ్చిమగోదావరి – 43
- కృష్ణా – 40
- గుంటూరు – 36
- తూర్పుగోదావరి – 27
- విశాఖపట్నం – 20
- నెల్లూరు – 14
- చిత్తూరు – 11
- అనంతపురం – 9
- ప్రకాశం – 8
- కడప – 6
- కర్నూల్ – 2
- శ్రీకాకుళం – 2
- విజయనగరం – 2
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ