ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా జీరోకి చేరింది. ప్రభుత్వ అధికారిక కోవిడ్ బులెటిన్ ప్రకారం ఏప్రిల్ 25, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఏప్రిల్ 26, సోమవారం ఉదయం 9 గంటలవరకు 2163 శాంపిల్స్ ను పరీక్షించగా ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ గా నమోదు కాలేదని తెలిపారు. రాష్ట్రంలో 2020లో కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చాక మళ్ళీ ఏ జిల్లాలో కూడా ఎలాంటి కరోనా కేసులు నమోదుకాకపోవడం ఇదే కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా ఫ్రీ దిశగా వెళ్తుంది. అలాగే కొత్తగా కరోనా వలన మరణాలు కూడా సంభవించలేదు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 12 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారని తెలిపారు. ఇక ఏప్రిల్ 25 నాటికీ ఏపీలో మొత్తం 3,35,19,781 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ