రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు వరకు ఒంటిపూట తరగతుల నిర్వహణ ఉంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఉదయం 7.45 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు జరుగుతాయని, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి పిల్లలను ఇంటికి పంపించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల పెరుగుతున్న కరోనా కేసులు, ఎండల నేపథ్యంలోనే ఒంటిపూట బడులుపై నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కరోనా నిబంధనలు తప్పకుండా పాటించేలా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్స్ ఏర్పాటు వంటి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ